Sunday, December 21, 2014
Saturday, December 20, 2014
Wednesday, December 17, 2014
Tuesday, December 16, 2014
Monday, December 15, 2014
Sunday, December 14, 2014
అల్లాహ్ స్మరణ విశిష్ఠత
నిశ్చయంగా అల్లాహ్ను స్మరించడం, ఆయన్ను వేడుకోవడం మహుత్పూర్వకం. అల్లాహ్ స్మరణలో పీల్చే ప్రతి శ్వాస, గడిచే ప్రతి ఘడియ, ప్రతి రోజు మంగళప్రదమయినదే. దాసుడు తన ప్రభువు సాన్నధ్యాన్ని పొందే అమల సాధనం అల్లాహ్ స్మరణ. అది దాసుని ఇహపరాల సకల మేళ్ళకు సంబంధించిన తాళంచెవి. అల్లాహ్ా ఈ కీని దాసునికి ప్రసాదించాడంటే దానర్థం-శుభాల తలుపులు అతని కోసం తెరిచాడన్న మాట. ఒకరిని ఈ వరప్రసాదానికి దూరం చేెశా డంటే, అతనికై మేలు తాలూకు తలుపులన్నీ మూసి వేయబడ్డాయన్న మాట. ఫలితంగా అతను కలత చెందిన మనస్సుతో, కంగారు నిండిన గుండెతో, స్థిమితం లేని ఆలోచనలతో,ఫలితం లేని చింతలతో, సత్తువ లేని సంకల్పాలతో సతమతమవ్వడం ఖాయం. దీనికి భిన్నంగా ధ్యానాన్ని ఆశ్రయించి, సదా అల్లాహ్ాను స్మరిస్తూ ఉండే వ్యక్తి మనస్సు నెమ్మదిస్తుంది. అతని హృదయం ప్రశాంతతో నిండుతుంది. అతని ఆత్మ శాంతితో పరవశిస్తుంది. ఖుర్ఆన్ ఇలా అంటోంది:
”విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణతో తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్ స్మరణతోనే హృదయాలు నెమ్మదిస్తాయి”. (అర్రాద్: 28)
ధ్యానం తాలూకు శుభాలు అనేకం; ఇహంలోనూ, పరంలోనూ. అల్లామా అబ్దుర్రహ్మాన్ నాసిరుస్సఅదీ (ర) అల్లాహ్ ధ్యానం గురించి ఇలా అభిప్రాయ పడ్డారు: ‘మహోన్నత అర్ష్కి ప్రభువయిన అల్లాహ్ా బహిరంగ, రహస్య స్మరణ-లేనిపోని చింతలతో నీవు సతమతమవు తున్న ఘడియలో నీ నుండి దురదృష్టాన్ని, దుఖాన్ని దూరం చేస్తుంది. ఇహపరాల మేళ్లన్నీ నీ ముంగిట వచ్చి వాలేలా చేస్తుంది.
ప్రవక్త (స) తన సహచరునికి ఓ రోజు హితోపదేశం చేశారు – ”అత్యధికంగా అల్లాహ్ాను స్మరించే వారు, ముందువారు- ముందే ఉంటారు” అని.
హజ్రత్ మఆజ్ (ర) గారికి వసీయతు చేస్తూ- ”అల్లాహ్ాను ధ్యానించే, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే, ఆయన్ను అత్యుత్తమ రీతిలో ఆరా ధించే విషయంలో ఆయన సహయాన్ని అర్ధించు” అన్నారు.
హితోపదేశాన్ని కోరుతూ వచ్చిన ఓ వ్యక్తిని ఉద్దేశించి-”నీ నాలుక అల్లాహ్ స్మరణతో సదా నానుతూనే ఉండాలి. అది నీలో స్థిత ప్రజ్ఞ తను పెంచి, నిన్ను భాగ్య బాటన నడిపిస్తుంది” అన్నారు.
”అల్లాహ్ా స్మరణ – స్మరించే వారి పాలిట శాశ్వత స్వర్గ వనాలలో మహా వృక్ష సృజనకు కారణం” అన్నారు.
”అల్లాహ్ాను స్మరించే దాసుడ్ని స్వయంగా అల్లాహ్ా తన వద్దనున్న దైవదూతల సమక్షంలో ప్రస్తావిస్తాడు” అన్నారు.
”దాసులు స్వర్గంలో ప్రవేశించిన మీదట కూడా అల్లాహ్ స్మరణ అనుక్షణం చేస్తూనే ఉంటారు” అన్నారు.
‘ధ్యానం దైవ ప్రేమకు మార్గం’ అన్న ఒక్క ప్రశంస చాలు అది ఎంత గొప్పదో చెప్పడానికి. ధ్యానం మనిషిని చాడీల నుండి, పరోక్ష నింద నుండి, ధర్మానికి కీడు కలిగించే ప్రతి చేష్ట నుండి కాపాడు తుంది.
అల్లాహ్ను స్మరించుకునే అదృష్టం లభించిన మనం నిజంగా మహా గొప్ప అదృష్టవంతులం. కానీ మన అశ్రద్ధో, అవివేకమో, అజ్ఞానమో ఏమో కానీ, ఎలాగయితే ఆయన్ను ఆరాధించడం, ఆయన్ను మాత్రమే వేెడుకోవడం తగ్గించేశామో, అలాగే అల్లాహ్ాను స్మరిం చడం, ఆయన స్మరణలోనే తరించడం దాదాపు మరచిపోయాం.
ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీలోని ప్రతి వ్యక్తిపై (శరీరంలోని ప్రతి కీలుపై) ప్రతి ఉదయం ఒక సత్కార్యం చేయడం అనివార్యమయి ఉంటుంది. పోతే, ప్రతి తస్బీహ్ా-సుబ్హానల్లాహ్ా సత్కార్యమే. ప్రతి తహ్మీద్-అల్హమ్దులిల్లాహ్ సత్కార్యమే. ప్రతి తహ్లీల్ – లా ఇలాహ ఇల్లల్లాహ్ సత్కార్యమే. ప్రతి తక్బీర్-అల్లాహు అక్బర్ అనడం సత్కార్యమే. మంచిని ఉపదేశించడం కూడా సత్కా ర్యమే. చెడుని వారించడం కూడా సత్కార్యమే. అయితే ఉషోదయం తర్వాత మనిషి చేసే రెండు రకాతుల (ఇష్రాక్) నమాజు వీటన్నిం టికి ప్రత్యామ్నాయం కాగలదు”. (ముస్లిం)
”నా స్మరణ నిమిత్తం నమాజును స్థాపించు” అన్న అల్లాహ్ మాట ప్రకారం మన నమాజు కూడా అల్లాహ్ా స్మరణే. అల్లాహ్ ఇలా సెల విస్తున్నాడు: ”ఓ విశ్వసిమచిన వారలారా! అల్లాహ్ను అత్యధికంగా స్మరించండి”. (అహ్జాబ్: 41)
ప్రవక్త (స) తన సహచరునికి ఓ రోజు హితోపదేశం చేశారు – ”అత్యధికంగా అల్లాహ్ాను స్మరించే వారు, ముందువారు- ముందే ఉంటారు” అని.
హజ్రత్ మఆజ్ (ర) గారికి వసీయతు చేస్తూ- ”అల్లాహ్ాను ధ్యానించే, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే, ఆయన్ను అత్యుత్తమ రీతిలో ఆరా ధించే విషయంలో ఆయన సహయాన్ని అర్ధించు” అన్నారు.
హితోపదేశాన్ని కోరుతూ వచ్చిన ఓ వ్యక్తిని ఉద్దేశించి-”నీ నాలుక అల్లాహ్ స్మరణతో సదా నానుతూనే ఉండాలి. అది నీలో స్థిత ప్రజ్ఞ తను పెంచి, నిన్ను భాగ్య బాటన నడిపిస్తుంది” అన్నారు.
”అల్లాహ్ా స్మరణ – స్మరించే వారి పాలిట శాశ్వత స్వర్గ వనాలలో మహా వృక్ష సృజనకు కారణం” అన్నారు.
”అల్లాహ్ాను స్మరించే దాసుడ్ని స్వయంగా అల్లాహ్ా తన వద్దనున్న దైవదూతల సమక్షంలో ప్రస్తావిస్తాడు” అన్నారు.
”దాసులు స్వర్గంలో ప్రవేశించిన మీదట కూడా అల్లాహ్ స్మరణ అనుక్షణం చేస్తూనే ఉంటారు” అన్నారు.
‘ధ్యానం దైవ ప్రేమకు మార్గం’ అన్న ఒక్క ప్రశంస చాలు అది ఎంత గొప్పదో చెప్పడానికి. ధ్యానం మనిషిని చాడీల నుండి, పరోక్ష నింద నుండి, ధర్మానికి కీడు కలిగించే ప్రతి చేష్ట నుండి కాపాడు తుంది.
అల్లాహ్ను స్మరించుకునే అదృష్టం లభించిన మనం నిజంగా మహా గొప్ప అదృష్టవంతులం. కానీ మన అశ్రద్ధో, అవివేకమో, అజ్ఞానమో ఏమో కానీ, ఎలాగయితే ఆయన్ను ఆరాధించడం, ఆయన్ను మాత్రమే వేెడుకోవడం తగ్గించేశామో, అలాగే అల్లాహ్ాను స్మరిం చడం, ఆయన స్మరణలోనే తరించడం దాదాపు మరచిపోయాం.
ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీలోని ప్రతి వ్యక్తిపై (శరీరంలోని ప్రతి కీలుపై) ప్రతి ఉదయం ఒక సత్కార్యం చేయడం అనివార్యమయి ఉంటుంది. పోతే, ప్రతి తస్బీహ్ా-సుబ్హానల్లాహ్ా సత్కార్యమే. ప్రతి తహ్మీద్-అల్హమ్దులిల్లాహ్ సత్కార్యమే. ప్రతి తహ్లీల్ – లా ఇలాహ ఇల్లల్లాహ్ సత్కార్యమే. ప్రతి తక్బీర్-అల్లాహు అక్బర్ అనడం సత్కార్యమే. మంచిని ఉపదేశించడం కూడా సత్కా ర్యమే. చెడుని వారించడం కూడా సత్కార్యమే. అయితే ఉషోదయం తర్వాత మనిషి చేసే రెండు రకాతుల (ఇష్రాక్) నమాజు వీటన్నిం టికి ప్రత్యామ్నాయం కాగలదు”. (ముస్లిం)
”నా స్మరణ నిమిత్తం నమాజును స్థాపించు” అన్న అల్లాహ్ మాట ప్రకారం మన నమాజు కూడా అల్లాహ్ా స్మరణే. అల్లాహ్ ఇలా సెల విస్తున్నాడు: ”ఓ విశ్వసిమచిన వారలారా! అల్లాహ్ను అత్యధికంగా స్మరించండి”. (అహ్జాబ్: 41)
Tuesday, December 9, 2014
Monday, December 8, 2014
Wednesday, December 3, 2014
లా ఇలాహ ఇల్లల్లాహ్
ప్రవక్త నూహ్ (అ) వారికి మరణ ఘడియలు సమీపించినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి ఇలా హితవు పలికారు: ”కుమారా! నేను నీకు రెండు విషయాల గురించి తాకీదు చేస్తున్నాను. రెండు విషయాల నుండి నిన్ను వారిస్తున్నాను. ఆయన చెప్పిన వాటిలో-”సప్తాకాశాలు, సప్త భూములు త్రాసు ఒక పళ్ళెంలో పెట్టి, ‘లా ఇలాహ ఇల్ల ల్లాహ్’ మరో పళ్ళెంలో పెట్టినట్లయితే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఉన్న పళ్ళమే వంగుతుంది’. సప్తాకాశాలు, సప్త భూములు ఒక ముద్దలా పదార్థంలా ఏర్పడితే వాటిన్నంటినీ లా ఇలాహ ఇల్లహ్ ఇల్లల్లాహ్ వేరు పరుస్తుంది. (అహ్మద్) ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఇలా పేర్కొంటుంది:
”భూమ్యాకాశాలు కలిసి ఉండగా, మేము వాటి ని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతీదానిని మేము నీటితో సృష్టించాము”. (అన్బియా:30)
సృష్టి మొత్తం కలిసి కూడా ఈ వచనానికి సరి తూగజాలదు అంటే ఈ వచనం ఎంతటి మహి మాన్వితమయినదో అర్థం చేెసుకోగలరు. ఈ కారణంగానే విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ (స) తన జాతి వారిని, తద్వారా సమస్త మాన వాళిని తొలుత పిలుపునిచ్చింది ఈ శిష్ఠ వచనం వైపునకే. ఓ ప్రజలారా! మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పండి. తద్వారా అరబ్బు, అరబ్బేతర ప్రాంతాలు మీ పాదాక్రాంతమవుతాయి’ అని చెప్పారు.
ప్రియ పాఠకుల్లారా! ఒక వ్యక్తి ఈ వచనాన్ని చదివే ఇస్లాం పరిధిలోకి ప్రవేశిస్తాడు. మనం కూడా ఈ శిష్ఠ వచనం ఆధారంగానే ముస్లింలు గా పరగణించబడుతున్నాము. ఈ వచనం మరి పెద్దదేమీ కాదు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’. అయితే ఈ వచనాన్ని ఓ వ్యక్తి మనసా, వాఛా, కర్మణా-త్రికరణ శుద్ధితో ఉచ్చరించిన మరుక్ష ణమే అతని జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.
ఉత్కృష్ట అల్లాహ్ స్మరణ
ఈ శిష్ఠ వచనం అల్లాహ్ తన దాసులకు అనుగ్రహించిన గొప్ప వర ప్రసాదం. ఈ వచన భాగ్యానికి మించిన భాగ్యం మరొకటి లేదు. ఈ వచన స్థాపన కోసమే సకల ప్రవక్తలు, సత్పురుషులు సంఘ బహిష్కర ణలకు, హత్యలకు, మారణకాండలకు గురయ్యారు. కొందరు నిలు వునా రెండుగా రంపాలతో కోయబడ్డారు. కొందరిని సజీవంగానే ఉంచి ఇనుప దువ్వెనలతో రక్కి మాంసాన్ని ఎముకల నుండి వేరు పర్చడం జరిగింది. కొందరిని సలసల మరగే నూనేలో నెట్టి వేంచే యడం జరిగింది. కొందరిని నిప్పులపై పడుకోబెట్టడం జరిగింది. కొందరిని సాపల్లో చుట్టి పొగెట్టడం జరిగింది. కొందరిని శిలువనెక్కిం చడం జరిగింది. మరికొందరిని వ్రేలాడదీసి శరీరాన్ని ముక్కముక్కలు గా కోయడం జరిగింది. ఈ వచన ఆధారంగానే సత్యాసత్యాల మధ్య సమర జ్వాలలు భగ్గుమన్నాయి. ఇదే శిష్ఠ వచనం, ఇదే శాంతి వచ నం, ఇదే శ్రేష్ఠ స్మరణ, ఇదే శాంతి నిలయం అయిన స్వర్గానికి తాళం చెవి. ఈ వచనాన్నే అల్లాహ్ ‘కలిమతున్ తయ్యిబా-సద్వచనం’ అని ‘ఉర్వతున్ ఉస్ఖా-బలీయమయిన కడియం’ అని అభివర్ణించాడు. ఇదే సత్య వచనం, ఇదే ధర్మ ప్రవచనం, ఇదే మహి మాన్విత, మహోత్కృష్ట పుణ్య వచనం. ఇదే చిత్త శుద్ధికి చిహ్నం, దాసుని అంకితభావానికి ఆనవాలు, పుణ్యఫలానికి పునాది. ఇదే ధర్మ సందేశం. ఇన్ని వీశిష్ఠతల కారణంగానే ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అన్నింటికంటే ఉత్కృష్ట అల్లాహ్ స్మరణ – ‘లా ఇలాహ ఇల్లల్లాహ్”. (తిర్మిజీ)
శిష్ఠ వచన విశిష్ఠత
(ఓ ప్రవక్తా!) ”లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడని నువ్వు బాగా తెలుసుకో”. (ముహమ్మద్:19)
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఈ శిష్ఠ వచన ఆధారంగానే భుమ్యాకాశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ వచన వ్యక్తీకరణ, స్మరణ కోసమే సృష్టి చరా చరాల సృజన జరిగింది. ఈ వచనం కోసమే అల్లాహ్ా ఇహపరాలను పుట్టించాడు. ఈ శిష్ఠ వచన పరిచయం కోసమే 1లక్ష 24వేల మంది దైవప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఈ వచన ఘనతా ఔన్నత్యాలను చాటడానికే దైవగ్రంథాలు అవతరించాయి. ఈ వచనం కోసమే తీర్పు దినం, లెక్కల ఘడియ, మహ్షర్ మైదానం ఏర్పాటు చేయబడింది. ఈ వచనం కోసమే స్వర్గనరకాలు చేయబడ్డాయి. ఈ వచన ఆధారంగానే మనుషులు, జిన్నాతులు-విశ్వాసులుగా, అవిశ్వాసులుగా, సజ్జనులుగా, దుర్జనులుగా, పుణ్యాత్ములుగా, పాపాత్ములుగా వర్గీకరించబడ్డారు. ఈ వచనం మూలానే సృష్టి అదృష్ట దురదృష్టాలు, సౌభాగ్యాసౌభాగ్యాలు, అభ్యున్నతి, అభ్యుదయాలు, ప్రగతి సాఫల్యాలు, సంక్షేమం శ్రేయో శుభాలు, శిక్షాబహుమానాలు ముడి పడి ఉన్నాయి. ఈ వచన ఆధా రంగానే రేపు మన కర్మల త్రాసు బరువుగానైనా, తేలికగానైనా తయా రవుతుంది. ఈ వచన ఆధారంగానే పరలోక మోక్షం ప్రాప్తమవు తుంది. ఈ వచన ఆధారంగానే కొందరు శాశ్వత నరకానికి ఆహుతి అయితే, మరికొందరు శాశ్వత స్వర్గానికి వారసులవుతారు. ఈ వచ నం గురించే అల్లాహ్ా పరమాణువుల లోకంలో సకల ఆత్మలతో ‘అలస్తు ప్రమాణం’-నేను మీ ప్రభువు కానా!’ అన్న ప్రమాణం తీసుకు న్నాడు. ఈ వచన ఆధారంగానే ముస్లింల ప్రార్థనా దిశ నియామకం జరిగింది. ఈ వచన ఆధారంగానే శ్రేష్ఠ సముదాయం వెలుగులోకి వచ్చింది.
Subscribe to:
Posts (Atom)