Wednesday, December 3, 2014

ఉత్కృష్ట అల్లాహ్‌ స్మరణ


ఈ శిష్ఠ వచనం అల్లాహ్‌ తన దాసులకు అనుగ్రహించిన గొప్ప వర ప్రసాదం. ఈ వచన భాగ్యానికి మించిన భాగ్యం మరొకటి  లేదు. ఈ వచన స్థాపన కోసమే సకల ప్రవక్తలు, సత్పురుషులు సంఘ బహిష్కర ణలకు, హత్యలకు, మారణకాండలకు గురయ్యారు. కొందరు నిలు వునా రెండుగా రంపాలతో కోయబడ్డారు. కొందరిని సజీవంగానే ఉంచి ఇనుప దువ్వెనలతో రక్కి మాంసాన్ని ఎముకల నుండి వేరు పర్చడం జరిగింది. కొందరిని సలసల మరగే నూనేలో నెట్టి వేంచే యడం జరిగింది. కొందరిని నిప్పులపై పడుకోబెట్టడం జరిగింది. కొందరిని సాపల్లో చుట్టి పొగెట్టడం జరిగింది. కొందరిని శిలువనెక్కిం చడం జరిగింది. మరికొందరిని వ్రేలాడదీసి శరీరాన్ని ముక్కముక్కలు గా కోయడం జరిగింది. ఈ వచన ఆధారంగానే సత్యాసత్యాల మధ్య సమర జ్వాలలు భగ్గుమన్నాయి. ఇదే శిష్ఠ వచనం, ఇదే శాంతి వచ నం, ఇదే శ్రేష్ఠ స్మరణ, ఇదే శాంతి నిలయం అయిన స్వర్గానికి తాళం చెవి. ఈ వచనాన్నే అల్లాహ్‌ ‘కలిమతున్‌ తయ్యిబా-సద్వచనం’ అని ‘ఉర్వతున్‌ ఉస్ఖా-బలీయమయిన కడియం’ అని అభివర్ణించాడు. ఇదే  సత్య వచనం, ఇదే ధర్మ ప్రవచనం, ఇదే మహి మాన్విత, మహోత్కృష్ట పుణ్య వచనం. ఇదే చిత్త శుద్ధికి చిహ్నం, దాసుని అంకితభావానికి ఆనవాలు, పుణ్యఫలానికి పునాది. ఇదే ధర్మ సందేశం. ఇన్ని వీశిష్ఠతల కారణంగానే ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అన్నింటికంటే ఉత్కృష్ట అల్లాహ్‌ స్మరణ – ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌”. (తిర్మిజీ)

No comments:

Post a Comment