(ఓ ప్రవక్తా!) ”లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడని నువ్వు బాగా తెలుసుకో”. (ముహమ్మద్:19)
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఈ శిష్ఠ వచన ఆధారంగానే భుమ్యాకాశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ వచన వ్యక్తీకరణ, స్మరణ కోసమే సృష్టి చరా చరాల సృజన జరిగింది. ఈ వచనం కోసమే అల్లాహ్ా ఇహపరాలను పుట్టించాడు. ఈ శిష్ఠ వచన పరిచయం కోసమే 1లక్ష 24వేల మంది దైవప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఈ వచన ఘనతా ఔన్నత్యాలను చాటడానికే దైవగ్రంథాలు అవతరించాయి. ఈ వచనం కోసమే తీర్పు దినం, లెక్కల ఘడియ, మహ్షర్ మైదానం ఏర్పాటు చేయబడింది. ఈ వచనం కోసమే స్వర్గనరకాలు చేయబడ్డాయి. ఈ వచన ఆధారంగానే మనుషులు, జిన్నాతులు-విశ్వాసులుగా, అవిశ్వాసులుగా, సజ్జనులుగా, దుర్జనులుగా, పుణ్యాత్ములుగా, పాపాత్ములుగా వర్గీకరించబడ్డారు. ఈ వచనం మూలానే సృష్టి అదృష్ట దురదృష్టాలు, సౌభాగ్యాసౌభాగ్యాలు, అభ్యున్నతి, అభ్యుదయాలు, ప్రగతి సాఫల్యాలు, సంక్షేమం శ్రేయో శుభాలు, శిక్షాబహుమానాలు ముడి పడి ఉన్నాయి. ఈ వచన ఆధా రంగానే రేపు మన కర్మల త్రాసు బరువుగానైనా, తేలికగానైనా తయా రవుతుంది. ఈ వచన ఆధారంగానే పరలోక మోక్షం ప్రాప్తమవు తుంది. ఈ వచన ఆధారంగానే కొందరు శాశ్వత నరకానికి ఆహుతి అయితే, మరికొందరు శాశ్వత స్వర్గానికి వారసులవుతారు. ఈ వచ నం గురించే అల్లాహ్ా పరమాణువుల లోకంలో సకల ఆత్మలతో ‘అలస్తు ప్రమాణం’-నేను మీ ప్రభువు కానా!’ అన్న ప్రమాణం తీసుకు న్నాడు. ఈ వచన ఆధారంగానే ముస్లింల ప్రార్థనా దిశ నియామకం జరిగింది. ఈ వచన ఆధారంగానే శ్రేష్ఠ సముదాయం వెలుగులోకి వచ్చింది.
No comments:
Post a Comment